ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం.. జగన్ సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభిషేక్ రెడ్డి మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. అభిషేక్ రెడ్డి మృతిపై వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ట్వీట్లు చేశాయి . అయితే వైఎస్ అభిషేక్ రెడ్డి వెంటిలేటర్పై ఉన్నారని వైఎస్ కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. అయితే అధికారికంగా ప్రకటన వస్తే క్లారిటీ వస్తుందని మరికొందరు చెబుతున్నారు. మరోవైపు కడప ఎంపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆస్ట్రేలియా నుంచి బయల్దేరారు.. బుధవారం రాత్రికి హైదారాబాద్కు చేరుకుంటారని తెలుస్తోంది. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం తాడేపల్లిలో ఉన్నారు.
వైఎస్ అభిషేక్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీప బంధువు. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి తండ్రి భాస్కర్రెడ్డి అన్న వైఎస్ ప్రకాశ్ రెడ్డి మనవడే వైఎస్ అభిషేక్రెడ్డి. అలాగే అభిషేక్రెడ్డి వైద్యవృత్తిలో ఉంటూనే పార్టీ కోసం పనిచేశారు. వైఎస్ అభిషేక్ రెడ్డి వైఎస్సార్సీపీ వైద్య విభాగ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు.. అలాగే పులివెందుల నియోజకవర్గం లింగాల మండల వైఎస్సార్సీపీ ఇంఛార్జ్గా ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రచారంలో అభిషేక్ రెడ్డి కీలకపాత్ర పోషించారు. కడప జిల్లాలో వైఎస్సార్సీపీలో కీలకంగా వ్యవహరించారు. వైఎస్ జగన్ పాదయాత్రలోనూ అభిషేక్ రెడ్డి యాక్టివ్గా ఉన్నారు.
గతేడాది సెప్టెంబర్లోనే అభిషేక్ రెడ్డి అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారని.. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే చర్చ జరిగింది.. ఈ అంశంపై రాజకీయంగా కూడా వార్ నడిచింది. వైఎస్ అభిషేక్ రెడ్డికి వైఎస్ వివేకానందరెడ్డి కేసుకు లింక్ చేస్తూ టీడీపీ ట్వీట్ చేయడంపై రాజకీయంగా దుమారం రేగింది. అలాగే కడప ఎంపీ స్థానానికి వైఎస్ అభిషేక్ రెడ్డి పేరును గతంలో పరిశీలించారనే ప్రచారం నడిచింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ అభిషేక్ రెడ్డి ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు.. ఆ తర్వాత హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.


0 Comments